కేఎన్ఆర్ పాఠశాలలో అదనపు గదులకు శంకుస్థాపన
ABN , First Publish Date - 2022-01-25T04:33:23+05:30 IST
నగరంలోని 22వ డివిజన్ పరిధిలో ఉన్న కేఎన్ఆర్ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఎన్ఎంసీ మేయర్ పొట్లూరి స్రవంతి సోమవారం నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
నెల్లూరు(సిటీ), జనవరి 24 : నగరంలోని 22వ డివిజన్ పరిధిలో ఉన్న కేఎన్ఆర్ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఎన్ఎంసీ మేయర్ పొట్లూరి స్రవంతి సోమవారం నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో గదులు చాలక అనేక మంది విద్యార్థులు చెట్ల కిందే చదువకుంటున్నారన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చొరవ తీసుకుని రూ.30 లక్షలతో అదనపు గదులు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారన్నారు. నాడు, నేడుతో ప్రభుత్వ పాఠశాలలను అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం ఆధునీకరిస్తుందని చెప్పారు. ఈ పాఠశాలకున్న ఖ్యాతిని మరింత కాపాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయభాస్కర్రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.