విద్యార్థులకు నగదు బహుమతులు

ABN , First Publish Date - 2022-08-19T03:19:52+05:30 IST

స్థానిక వెంగళరావునగర్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు మున్సిపల్‌ పాఠశాలలో పదోతరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు

విద్యార్థులకు నగదు బహుమతులు
నగదు బహుమతులు అందుకున్న విద్యార్థులు

కావలి, ఆగస్టు18: స్థానిక వెంగళరావునగర్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు మున్సిపల్‌ పాఠశాలలో పదోతరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు అందచేశారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో 500కిపైగా మార్కులు సాధించిన రాగిపాటి సోనియాకు రూ.2,516లు, సయ్యద్‌ హఫీజ్‌ఆలీకి రూ.1516లు, చెన్నంశెట్టి శ్రీకాంత్‌కు రూ.1116లను విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రమణారెడ్డి అందచేశారు.  పాఠశాల  లెక్కల టీచర్‌ ఫణి గణితంలో మార్కులు ఎక్కువ వచ్చిన ముగ్గురు విద్యార్థులకు రూ.3,500 చొప్పున అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్‌ గోళ్ల అమరజ్యోతి, వైస్‌చైర్మన్‌ సయ్యద్‌ ఘనీబాష,  విశ్రాంత లెక్చరర్‌ ఎంవీఎన్‌ ప్రసాద్‌రావు. హయ్యూల్‌ హయ్యూమ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-19T03:19:52+05:30 IST