మైనింగ్పై ప్రజాభిప్రాయ సేకరణ
ABN , First Publish Date - 2022-06-29T03:22:48+05:30 IST
మండల పరిధిలోని ఊటుకూరులో సాధన మైనింగ్పై మంగళవారం పర్యావ రణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సంద
సైదాపురం, జూన్ 28: మండల పరిధిలోని ఊటుకూరులో సాధన మైనింగ్పై మంగళవారం పర్యావ రణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో నారాయణమ్మ మాట్లాడుతూ గిద్దలూరులోని సర్వే నెంబర్ 114/3(పి)లో ఓపెన్ కాస్ట్ పద్ధతిలో 6.896 హెక్టార్ల విస్తీర్ణంలో చేపట్టే క్వార్జ్-6965 టన్స్ ఫర్ యానమ్ (టీపీఏ), మైకా-3483 టీపీఏ, పెల్డ్స్పార్-41792 టీపీఏ చేసే మైనింగ్ ప్రాజెక్ట్పై ప్రజాభిప్రాయ సేకరణలో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. దీంతో మైనింగ్ అనుమతుల కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామన్నారు. కార్యక్రమంలో పొల్యూషన్ అధికారి రాజశేఖర్, తహసీల్దార్ కృష్ణ, మైనింగ్ యజమాని సురేష్రెడ్డి, ఎన్జీవోలు, తదితరులు పాల్గొన్నారు.