కావలి టీడీపీ ఇన్‌చార్జిగా మాలేపాటి

ABN , First Publish Date - 2022-02-18T02:52:59+05:30 IST

కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా దగదర్తి మండలానికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చె

కావలి టీడీపీ ఇన్‌చార్జిగా మాలేపాటి
మాలేపాటి సుబ్బానాయుడు

కావలి, ఫిబ్రవరి 17: కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా దగదర్తి మండలానికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన కావలి నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో అందరి అభిప్రాయం మేరకు, ఇన్‌చార్జి పేరు ఒక కొలిక్కిరాగా గురువారం అధికారికంగా ప్రకటించారు. ఇన్‌చార్జిగా మాలేపాటి సుబ్బానాయుడును నియమిస్తూ  అధిష్ఠానం నియోజకవర్గ బరువు బాధ్యతల న్నింటిని జాతీయ ప్రధాన కార్యదర్శి  బీద రవిచంద్రపై పె ట్టింది. దీంతో రవిచంద్ర సూచనల మేరకు సుబ్బానా యుడు నేతృత్వంలో పార్టీని కార్యకర్తలు బలోపేతం చేయనున్నారు. ఇన్‌చార్జితోపాటు టీడీపీ రాష్ట్రపార్టీ  కార్యదర్శులుగా కావలి నియోజకవర్గానికి చెందిన మలిశెట్టి వెంకటేశ్వర్లు, రేబాల శంకరరెడ్డిల పేర్లను కూడా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు.


Updated Date - 2022-02-18T02:52:59+05:30 IST