డైట్‌ కళాశాలలో ముగిసిన కళా ఉత్సవ్‌

ABN , First Publish Date - 2022-12-09T23:04:47+05:30 IST

మండలంలోని డైట్‌ కళాశాలలో జిల్లాస్థాయి కళా ఉత్సవ్‌ శుక్రవారం విజయవంతంగా ముగిసినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు తెలిపారు.

డైట్‌ కళాశాలలో ముగిసిన కళా ఉత్సవ్‌
రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్‌కు ఎంపికైన విద్యార్థులతో నిర్వాహకులు

ఇందుకూరుపేట, డిసెంబరు 9 : మండలంలోని డైట్‌ కళాశాలలో జిల్లాస్థాయి కళా ఉత్సవ్‌ శుక్రవారం విజయవంతంగా ముగిసినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కళా ఉత్సవ్‌ జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ డైట్‌ కళాశాలలో నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని 15 పాఠశాలలు, కళాశాలల నుంచి 50 మంది విద్యార్థులు 10విభాగాలలో పోటీ పడ్డారని, ఒక్కో విభాగంలో ప్రథమ స్థాయిలో గెలిచినవారు రాష్ట్రస్థాయిలో కళాఉత్సవ్‌కు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్‌ డిసెంబరు 12, 13 తేదీల్లో విజయవాడలో జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డైట్‌ అధ్యాపకులు డాక్టర్‌ ఆర్‌. బాలాజీరావు, పి.అల్తాఫ్‌, ఎస్‌కె.జిలేకాబీ, బి.దశరఽథరామిరెడ్డి, ఎస్‌.బోయదాసు, ఎస్‌.నరసింహమూర్తి, విజయచంద్ర, డి.నరసింహరావు, సోమేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:04:48+05:30 IST