గుడ్డ సంచుల పంపిణీ
ABN , First Publish Date - 2022-06-27T01:45:40+05:30 IST
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక రైతు బజారు వద్ద గుడ్డ సంచులు పంపిణీ చేశారు.
కావలి, జూన్ 26 : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక రైతు బజారు వద్ద గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేవీవీ పట్టణాధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు, నాయకులు డాక్టర్ బెజవాడ రవికుమార్, ఆకుల రమణయ్య, సీ.శారద, జీ.కల్యాణి మాట్లాడుతూ విచ్చలవిడిగా ప్లాస్టిక్ సంచులు వినియోగించడం ద్వారా భూమి పొరలలోని నీరు భూమిలోకి ఇంకకుండా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయన్నారు. పశువులు ప్లాస్టిక్ సంచులు తిని మృత్యువాత పడుతున్నాయని, సముద్ర జలాల్లో ప్లాస్టిక్తో సముద్ర సంపద నశించి పోతుందన్నారు. టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లలో వేడిపదారావినియోగించే కవర్లు కరిగి ఆహార పదార్థాల్లో చేరి అవి తిన్న వారికి జీర్ణకోశ, కేన్సర్ వ్యాధులు వస్తున్నాయన్నారు. వాతావరణం కలుషితమై పర్యావరణ పరిరక్షణ దెబ్బ తింటుందన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నాయకులు జీ. హరినాథ్, టీ. సుబ్బరామశర్మ, కందికట్టు నారాయణ, పాపిశెట్టి జానకి రామయ్య, షేక్ ఖాదర్బాషా, వెంకయ్య, చలపతిరావు, వై.రమణయ్య, సామాజిక కార్యకర్త మాలకొండారెడ్డి పాల్గొన్నారు,