డీఏలతో కలిపి జీతాలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-01-29T03:01:57+05:30 IST
ఉపాధ్యాయులకు 5 డీఏలతో కలిపి జీతాలు ఇవ్వాలంటూ శుక్రవారం ఉపాధ్యాయ ప్రతినిధులు ఎంఈవో వెంకట్సునీల్కు వినతిపత్రం అందజేశారు.
కోట, జనవరి 28 : ఉపాధ్యాయులకు 5 డీఏలతో కలిపి జీతాలు ఇవ్వాలంటూ శుక్రవారం ఉపాధ్యాయ ప్రతినిధులు ఎంఈవో వెంకట్సునీల్కు వినతిపత్రం అందజేశారు. స్థానిక ఎమ్మార్సీ భవనంలో ఆయనను కలిశారు. ఆర్టీఎస్ 2015 ప్రకారం 5 డీఏలతో కలిపి వేతనాలు ఇవ్వాలని, అందుకు సంబంధించిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో రమేష్, నాగరాజు, మనోహర్, మోహన్వంశీ, సుబ్బయ్య, ఆదిశేషయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.