డ్రైవర్లు నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2022-01-29T02:58:47+05:30 IST
వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఇన్చార్జీ ఆర్టీవో మురళీమోహన్ అన్నారు.
గూడూరు, జనవరి 28: వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఇన్చార్జీ ఆర్టీవో మురళీమోహన్ అన్నారు. శుక్రవారం స్థానిక శారదానగర్లోని ఎల్ఏపీ పాఠశాలలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండని వారు వాహనాలు నడిపితే జరిమానా తప్పదన్నారు. విద్యాసంస్థల బస్సులు ఎప్పటికప్పుడు కండిషన్ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంవీఐ శేషురెడ్డి, కరస్పాండెంట్ బుస్సారెడ్డి శ్రీకాంత్రెడ్డి, సురేష్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.