టీడీపీతోనే దళితుల అభ్యున్నతి

ABN , First Publish Date - 2022-01-20T03:07:07+05:30 IST

దళితుల అభ్యున్నతికి పాటుపడింది టీడీపీయేనని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌ కుమార్‌ తెలిపారు.

టీడీపీతోనే దళితుల అభ్యున్నతి
దళిత ప్రజాప్రతిఘటన సదస్సులో మాజీ ఎమ్మెల్యేలు పాశిం సునీల్‌కుమార్‌, నెలవల సుబ్రమణ్యం

గూడూరు, జనవరి 19: దళితుల అభ్యున్నతికి పాటుపడింది టీడీపీయేనని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌ కుమార్‌ తెలిపారు. టీడీపీ ఎస్సీ ఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌రాజు ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలోని ఉదయ్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో నిర్వహించిన దళిత ప్రజాప్రతిఘటన సదస్సుకు హాజరైన ఆయన, ఇందుకు సంబంధించిన విశేషాలను వెల్లడించారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయన్నారు.  రాబోయే రోజుల్లో దళితులు వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు పరసారత్నం, నెలవల సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారన్నారు.  

Updated Date - 2022-01-20T03:07:07+05:30 IST