సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2022-08-19T03:28:57+05:30 IST
సీపీఐ 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈనెల 26న విశాఖలో జరిగే ప్రజాప్రదర్శన, బహిరంగసభను జయప్రదం చేయాల
కావలి, ఆగస్టు18: సీపీఐ 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈనెల 26న విశాఖలో జరిగే ప్రజాప్రదర్శన, బహిరంగసభను జయప్రదం చేయాలని ఆ పార్టీ కావలి నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యనారాయణ కోరారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో గురువారం మహాసభ గోడపత్రికను నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబరు 26న ఆవిర్భవించిన సీపీఐ స్వాతంత్య్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిం దన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా బడుగు, బలహీన వర్గాలు, పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. 4,000 మంది కార్యకర్తల బలిదానంతో 10 లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కిందన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 26 నుంచి 28 వరకు 27వ రాష్ట్ర మహాసభలు విశాఖలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవూరు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.