27 మద్యం సీసాల పట్టివేత
ABN , First Publish Date - 2022-05-23T03:25:42+05:30 IST
గుడ్లూరు పరిసర ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడిని ఆదివారం
గుడ్లూరు, మే 22 : గుడ్లూరు పరిసర ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడిని ఆదివారం కందుకూరు సెబ్ అధికారులు పట్టుకున్నారు. సెబ్ అధికారుల సమాచారం మేరకు, గుడ్లూరుకు చెందిన కే బ్రహ్మయ్య(28) గుడ్లూరులోని మద్యం దుకాణం నుంచి అక్రమంగా మద్యాన్ని ఆదివారం కందుకూరు రోడ్డు వైపునకు తీసుకువెళుతుండగా, సమాచారం అందుకున్న కందుకూరు సెబ్ సీఐ మౌలాలి, సిబ్బందితో మాటు వేసి అదుపులోకి తీసుకున్నాడు. అతడి వద్ద నుంచి అమ్మేందుకు సిద్ధంగా గోతంలో ఉంచిన 27 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.