‘అన్ని వర్గాలను మోసం చేసిన వైసీపీ’
ABN , First Publish Date - 2022-12-10T00:35:48+05:30 IST
ఒక్క చాన్స్ పేరుతో ప్రజ లను మభ్యపెట్టిన వైసీపీ అధికారంలో వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసిందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు యల్లప్పనాయుడు, టీఎన్టీయూసీ తాలూకా అధ్యక్షుడు గోపాల్నాయుడు విమర్శించారు.
కోడుమూరు(రూరల్), డిసెంబరు 9: ఒక్క చాన్స్ పేరుతో ప్రజ లను మభ్యపెట్టిన వైసీపీ అధికారంలో వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసిందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు యల్లప్పనాయుడు, టీఎన్టీయూసీ తాలూకా అధ్యక్షుడు గోపాల్నాయుడు విమర్శించారు. శుక్రవారం సాయంత్రం టీడీపీ నాయకులు స్థానిక చిన్నమసీదు, జీతూరి వీధిలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి చేపట్టారు. ఇంటింటికి తిరిగి వైసీపీ పాలన గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు హనుమంతప్ప, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంతియాజ్బాష, చేనేత సంఘం మండల అధ్యక్షుడు భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ హరి బాబు, మాజీ ఎంపీటీసీ మాధవస్వామి పాల్గొన్నారు.
జగన్ను ఇంటికి సాగనంపుదాం: టీడీపీ
ఓర్వకల్లు: రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనం పాలని టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి అన్నారు. శుక్రవా రం మండల కేంద్రమైన ఓర్వకల్లులో ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలు ఎదుర్కొం టున్న సమస్య లను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని కాలనీవాసులు వాపోయారు. ఈ సందర్భంగా గోవింద రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని, త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీకాంతారెడ్డి, ఎల్లారెడ్డి, వేణుగోపా ల్రెడ్డి, కార్యకర్తలు అబ్దుల్లా, ఆదామ్, నాగరాజు, బత్తుల వెంకటరమణ, అయూబ్, అల్లాబాబు తదితరులు పాల్గొన్నారు.