ముగిసిన ప్రతిష్ఠ వేడుకలు
ABN , First Publish Date - 2022-05-21T05:25:02+05:30 IST
మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో వెంకటేశ్వరుడు, శివాలయ ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు.
రుద్రవరం, మే 20: మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో వెంకటేశ్వరుడు, శివాలయ ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య 5 రోజుల పాటు కొనసాగిన వేడుకలు శుక్రవారం ముగిశాయి. వెంకటేశ్వరస్వామి విగ్రహం, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం, గోదాదేవి విగ్రహం, గరుత్మంతుడు విగ్రహం, వరహా విగ్రహం, విమాన శిఖరం, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అలాగే మహాత్రిపురసుందరి సమేత మానస లింగేశ్వరస్వామి, శివలింగం ప్రతిష్ఠించారు. అలాగే ఆంజనేయుడి విగ్రహం, నవగ్రహాలు, నాగులకట్ట, విగ్నేశ్వరుడు విగ్రహాలను ప్రతిష్ఠించారు.
కమనీయం.. కల్యాణం
వాసాపురంలో వెంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి అమ్మవార్ల కల్యాణం కమనీయంగా జరిగింది. అలాగే శివపార్వతుల కల్యాణం కమనీయంగా సాగింది. అశేషంగా తరలివచ్చిన భక్తులు కల్యాణ వేడుకలను తిలకించారు.
భక్తులకు అన్నదానం
వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయం, శివాలయం ప్రతిష్ఠకు తరలివచ్చిన భక్తులకు దేవాలయ కమిటీ అన్నదానం నిర్వహించారు. ఎస్ఐ నిరంజన్రెడ్డి ప్రతిష్ఠ పూజల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పూజల్లో పాల్గొన్న ప్రముఖులు
టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాతరెడ్డి, బీజేపీ నాయకుడు భూమా కిషోర్రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి వేర్వేరుగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.