శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర
ABN , First Publish Date - 2022-03-18T14:59:58+05:30 IST
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లను శ్రీ శ్రీ శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం దర్శించుకున్నరు.
కర్నూలు: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లను శ్రీ శ్రీ శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామికి ఆలయ రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో అర్చకులు వేద పండితులు ఈవో లవన్న, ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం మండపంలో స్వామీజీని అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.