బయలు వీరభద్ర స్వామికి పూజలు
ABN , First Publish Date - 2022-11-23T23:50:19+05:30 IST
శ్రీశైల క్షేత్రంలో బుధవారం అమావాస్యను పురస్కరించుకొని క్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామికి పరోక్ష సేవగా విశేషార్చనలు నిర్వహించారు.
శ్రీశైలం, నవంబరు 23: శ్రీశైల క్షేత్రంలో బుధవారం అమావాస్యను పురస్కరించుకొని క్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామికి పరోక్ష సేవగా విశేషార్చనలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా మహాగణపతికి పూజలు చేశారు. ఈ పరోక్షసేవలో ఆలయ ఈవో ఎస్. లవన్న పాల్గొన్నారు. భక్తులు ఈ పరోక్షసేవలో పాల్గొనేందుకు దేవస్థానం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం.ఒఆర్జీద్వారా ఒక్కొక్కపూజకు రూ. 1,116 సేవా రుసుమును చెల్లించి పాల్గొనవచ్చునని ఈవో తెలిపారు. సాక్షిగణపతికి, ఆలయ ప్రాంగణంలోని జ్వాలా వీరభద్రస్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా సాయంత్రం విశాఖపట్నానికి చెందిన టి.శైలజ నృత్య ప్రదర్శన అలరించింది.