డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీసు
ABN , First Publish Date - 2022-09-20T04:36:40+05:30 IST
డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న న్యూరోసర్జన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.రాజే్షకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డా.జీఎ్స.నరేంద్రనాథ్ రెడ్డి మెమో జారీ చేశారు.
న్యూరోసర్జరీ అసిస్టెట్ ప్రొఫెసర్కు మెమో
కర్నూలు(హాస్పిటల్), సెప్టెంబరు 19: డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న న్యూరోసర్జన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.రాజే్షకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డా.జీఎ్స.నరేంద్రనాథ్ రెడ్డి మెమో జారీ చేశారు. సీసీఎ రూల్స్ ప్రకారం న్యూరో సర్జరీ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డీఎంఈకి నివేదించనున్నారు. ఈ నెల 15వ తేదీన క్యాజువాల్టీ డ్యూటీ సమయంలో ఉండకుండా ప్రైవేటు క్లినిక్లో ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధారాలతో గుర్తించారు. దీంతో ఆసుపత్రి ఈ నెల 16వ తేదీన మెమో జారీ చేసి వివరణ ఇవ్వాలని న్యూరోసర్జనను ఆదేశించారు. వైద్యుడు వివరణతో సంతృప్తి చెందని సూపరింటెండెంట్ మళ్లీ సోమవారం రెండోసారి మెమో జారీ చేశారు.