ఇంట్లో డీజిల్ పోసిన అగంతకులు
ABN , First Publish Date - 2022-12-10T00:19:28+05:30 IST
అర్ధరాత్రి ఇంట్లో డీజిల్ పోసిన ఘటన మండల పరిధిలోని వడ్డెమాను గ్రామంలో చోటు చేసుకుంది.
నందికొట్కూరు, డిసెంబరు 9: అర్ధరాత్రి ఇంట్లో డీజిల్ పోసిన ఘటన మండల పరిధిలోని వడ్డెమాను గ్రామంలో చోటు చేసుకుంది. బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ ఓబులేసు తెలిపిన వివరాలివీ.. వడ్డెమాను గ్రామంలో నివాసం ఉంటున్న వెంకటస్వామి ఇంటి తలుపుల ద్వారం నుంచి ఇంట్లోకి డీజిల్ పోసిన ఘటన కలకలం రేపింది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వెంకటస్వామిని పోలీసులు విచారించడంతో తనకు ఎవరితో శత్రుత్వం లేదని, ఎవరిపై అనుమానం లేదని చెప్పినట్లు ఎస్ఐ తెలిపారు. అయితే వచ్చిన సమాచారం మేరకు విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఆస్తి పంపకాల్లో అన్నదమ్ములకు సమస్యలు ఉన్నాయని తెలియడంతో ఆ కోణంలో కూడా విచారిస్తున్నామని ఎస్ఐ తెలిపారు.