చిరుతపులి కలకలం
ABN , First Publish Date - 2022-12-07T00:27:41+05:30 IST
దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ ప్రధాన కేంద్రంలోని విద్యుత్ లోక్షెడ్ ప్రాంతంలో సోమవారం రాత్రి చిరుత పులి కనిపించడం కలకలం రేపింది.
చిప్పగిరి, డిసెంబరు 6: దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ ప్రధాన కేంద్రంలోని విద్యుత్ లోక్షెడ్ ప్రాంతంలో సోమవారం రాత్రి చిరుత పులి కనిపించడం కలకలం రేపింది. గుంతకల్లు రైల్వే డీజిల్ షెడ్లో పనిచేస్తున్న ఓ కార్మికుడు చిరుతను గుర్తించిపై అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఏ మంగాచార్యులు తన అధికార యంత్రాంగంతో డీజిల్ షెడ్ ప్రాంతంలో చిప్పగిరి మండల గ్రామాల పొలాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ సిబ్బంది ధైర్యం చెబుతున్నారు. రైల్వే వర్గాలతో పాటు అటవీ శాఖా అధికారులకు సైతం సమాచారం అందించి అప్రమత్తం చేయాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.