కర్నూలు జిల్లాలో రైతులు ధర్నా.. సాగునీరు కోసం ఆందోళన
ABN , First Publish Date - 2022-01-07T16:08:42+05:30 IST
తెలుగు గంగ కేసీ కెనాల్ ఆయుకట్టుకు రబీలో సాగునీరు అందించాలని కోరుతూ రైతుల ఆందోళన
కర్నూలు జిల్లా: తెలుగు గంగ కేసీ కెనాల్ ఆయుకట్టుకు రబీలో సాగునీరు అందించాలని కోరుతూ రైతులతో కలిసి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. మంత్రి అనీల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇరిగేషన్ అంశం లేకపోవడం, చర్చకు రాకపోవడం దారుణమని నేతలు, రైతులు అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వకపోతే వెలుగోడు రిజర్వాయర్ నుంచి తెలుగు గంగకు నీళ్లు విడుదల చేసే షట్టర్లను మూసివేస్తామని బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు.