‘హైకోర్టు తీర్పును పట్టించుకోని జగన్ ప్రభుత్వం’
ABN , First Publish Date - 2022-06-26T05:21:45+05:30 IST
హైకోర్టు తీర్పును జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు జరుగుల పుల్లయ్య అన్నారు.
కర్నూలు, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు తీర్పును జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు జరుగుల పుల్లయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబును పుల్లయ్యతో పాటు పలువురు కలిసి నీరు-చెట్టు పెండింగ్ బిల్లులు పురోగతి నివేదికను అందజేశారు. పుల్లయ్య మాట్లా డుతూ నీరు-చెట్టు బిల్లులు మూడేళ్లుగా పెండింగులో పెట్టడం దారుణమని, సీఎం జగన్ నిర్వాకం వల్ల పలువురు ఆత్మహత్యలు చేసుకోగా, వందలాది మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం తక్షణ మే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బిల్లులు అందర ఆత్మహత్య చేసుకున్న రైతులకు ప్రభుత్వమే బాధ్యత వహించి ఆర్థిక సాయం అందించాలన్నారు. రాష్ట్రంలో 2,237 మందికి నీరు-చెట్టు పెండింగ్ బిల్లులు ఆరు వారాల్లో చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయడం లేదన్నారు.