విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
ABN , First Publish Date - 2022-12-10T00:31:46+05:30 IST
జిల్లా వ్యాప్తంగా అనుకోకుండా జరిగే విపత్తు లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకట సుబ్బారెడ్డి అన్నారు.
జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకట సుబ్బారెడ్డి
కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 9: జిల్లా వ్యాప్తంగా అనుకోకుండా జరిగే విపత్తు లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకట సుబ్బారెడ్డి అన్నారు. డైరెక్టర్ ఏపీఎస్ఐఆర్డీపీఆర్ అండ్ ఏపీఎస్డీఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో ఎన్నికైన ఆపద మిత్రలకు(కమ్యూనిటీ వలంటీర్లు, ఆశా వర్కర్లు) శుక్రవారం జడ్పీ ఆవరణలోని డీపీఆర్సీలో శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈవో మాట్లాడుతూ విపత్తు జరిగినప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వాలో కూడా తెలియని ప్రజ లు ఉన్నారన్నారు. దీని కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆపదమిత్రలకు శిక్షణ ఇస్తోం దని వెల్లడించారు. ప్రతి గ్రామం, మండలం, పట్టణంలో వీరంతా విపత్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను ప్రజలకు విస్తారని తెలిపారు. అనంతరం అనుపమ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని ఆపదమిత్రలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు, డీఎల్పీవో తిమ్మక్క, శిక్షణ మేనేజర్ గిడ్డేష్ తదితరులు పాల్గొన్నారు.