విద్యుత్‌ అధికారుల నిర్బంధం

ABN , First Publish Date - 2022-12-07T01:20:53+05:30 IST

విద్యుత్‌ అధికారులను అరికెర గ్రామస్తులు మంగళవారం నిర్బం ధించారు.

విద్యుత్‌ అధికారుల నిర్బంధం
విద్యుత్‌ అధికారులను నిర్బంధించిన గ్రామస్థులు

ఆలూరురూరల్‌, డిసెంబరు 6: విద్యుత్‌ అధికారులను అరికెర గ్రామస్తులు మంగళవారం నిర్బం ధించారు. వరిగడ్డి ట్రాక్టర్‌కు విద్యుత్‌ వైర్లు తగిలి మంటలు చెలరేగి కాలిపోవడంతో విద్యుత్‌ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు బసవన్న గుడి దగ్గర విద్యుత్‌ అధికారులు ఎస్‌ఎల్‌ఐ కొండారెడ్డి, ఎల్‌ఐ దేవేంద్ర నాయక్‌, ఏఎల్‌ఎం సోమశేఖర్‌లను నిర్భందించారు. పది రోజులలో సమస్యను పరిష్కరిస్తామని రాసివ్వడంతో శాంతించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ కుప్పగల్‌ నాగరాజు మాట్లాడుతూ గ్రామంలో విద్యుత్‌ వైర్లు వేలాడుతున్నాయని, ఇనుప స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో నిర్బంధించామని చెప్పారు.

Updated Date - 2022-12-07T01:20:56+05:30 IST