Nandyalaలో సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర

ABN , First Publish Date - 2022-05-29T17:55:40+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర ఆదివారం నంద్యాలలో ప్రారంభమైంది.

Nandyalaలో సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర

Nandyala: వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర (Bus Yatra) నాల్గవ రోజు ఆదివారం నంద్యాలలో ప్రారంభమైంది. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేయడమే ఈ బస్సుయాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 25 మంది మంత్రులు ఉంటే  అందులో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారని అంజాద్ భాషా తెలిపారు. కాగా ఈ బస్సు యాత్ర ఆదివారంతో ముగియనుంది. ఇవాళ సాయంత్రం అనంతపురంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొననున్నారు. 

Updated Date - 2022-05-29T17:55:40+05:30 IST