కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకోవాలి
ABN , First Publish Date - 2022-08-11T06:01:56+05:30 IST
నంద్యాలలో రౌడీమూకల చేతిలో దారుణ హత్యకు గురైన కానిస్టేబుల్ సురేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కోరారు.
నంద్యాల (నూనెపల్లె), ఆగస్టు 10: నంద్యాలలో రౌడీమూకల చేతిలో దారుణ హత్యకు గురైన కానిస్టేబుల్ సురేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాలని టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కోరారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ను భూమా బ్రహ్మానందరెడ్డి కలిసి మాట్లాడారు. రౌడీమూకలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు. సురేంద్ర కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ను త్వరగా వచ్చేలా సహాయ సహకారాలు అందించాలన్నారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. నంద్యాలలో రౌడీమూకల ఆగడాలు అధికమవుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అండగా నిలబడి, ప్రజల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించాలన్నారు.