అరటి తోటల దగ్ధం
ABN , First Publish Date - 2022-03-06T05:11:07+05:30 IST
మహానంది మండలం శ్రీనగరం సమీపంలోని అరటితోటలకు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం శనివారం సంభవించింది.
- 20 ఎకరాల తోటలు కాలిబూడిద
- రూ. 20 లక్షల నష్టం
మహానంది, మార్చి 5: మహానంది మండలం శ్రీనగరం సమీపంలోని అరటితోటలకు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం శనివారం సంభవించింది. దీనివల్ల దాదాపు 20 ఎకరాల పంట కాలిపో వడంతో రూ. 20 లక్షలు పంట నష్టం జరిగిందని భాధిత రైతులు తెలిపారు. ప్రసాద్, గాజుల శ్రీను, బొరుగుల శివ, శ్రీధర్ అనే రైతులకు చెందిన అరటితోటలు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.