23 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , First Publish Date - 2022-05-16T04:56:37+05:30 IST
మద్దికెర గ్రామంలోని జిల్లాపరిషత్ బాలుర పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 23 ఏళ్ల తరువాత కలుసుకున్నారు.
మద్దికెర, మే 15: మద్దికెర గ్రామంలోని జిల్లాపరిషత్ బాలుర పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 23 ఏళ్ల తరువాత కలుసుకున్నారు. ఆదివారం మద్దికెర జిల్లా పరిషత్ పాఠశాలలో 1999వ 10వ తరగతి విద్యార్థులు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో అప్పటి ఉపాధ్యాయులు బ్లేసినమ్మ, నాగేశ్వరరావు, దేవేంద్రప్ప, ఖాజాహుసేన్, ఉపాధ్యాయులతో కలిసి సంతోషంగా గడిపారు. 23 ఏళ్ల తరువాత ఒకరినొకరు కలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమను గుర్తించుకొని అందరినీ ఒకే చోట కలపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం అందరూ కలిసి విందు భోజనాలు చేశారు.