‘కిషోర బాలికలు సమతుల్య ఆహారం తీసుకోవాలి’

ABN , First Publish Date - 2022-05-29T06:21:45+05:30 IST

రక్తహీనత రాకుండా కిషోర బాలికలు ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య సూచించారు.

‘కిషోర బాలికలు సమతుల్య ఆహారం తీసుకోవాలి’

కర్నూలు(హాస్పిటల్‌), మే 28: రక్తహీనత రాకుండా కిషోర బాలికలు ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య సూచించారు. నగరంలో రోజా-2 అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఋతుక్రమం పరిశుభ్రత దినోత్సవాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం బాలికలకు శానిటరీ వ్యాప్‌కిన్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌బీఎ్‌సకే జిల్లా కోఆర్డినేటర్‌ హేమలత, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-29T06:21:45+05:30 IST