35 మంది మైనర్లపై కేసు నమోదు
ABN , First Publish Date - 2022-12-07T01:12:54+05:30 IST
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 35 మంది మైనర్లపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్నూలు, డిసెంబరు 6: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 35 మంది మైనర్లపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నగరంలోని రాజ్విహార్, జిల్లా పరిషత్ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. త్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహ నాలు నడుపుతున్న 35 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. వారందరినీ వారి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి డీఎస్పీ నాగభూషణం కౌన్సెలింగ్ ఇచ్చారు. వీరిపై కేసు నమోదు చేసి రూ.18వేలు జరిమానా విధించినట్లు డీఎస్పీ తెలిపారు.