వైసీపీని గద్దెదించాలి
ABN , First Publish Date - 2022-06-29T06:28:16+05:30 IST
వైసీపీని గద్దెదించాలి
హనుమాన్జంక్షన్, జూన్ 28 : రాష్ట్రం లో వైసీపీని గద్దెదించి టీడీపీని అధికారం లోకి తెచ్చే వరకు ప్రతి టీడీపీ కార్యకర్త కృషి చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చుల అర్జునుడు అన్నారు. మంగళవారం గుడివాడ మినీ మహానాడు సన్నాహలపై జంక్షన్లోని టీడీపీ కార్యాలయంలో బాపుల పాడు మండల ముఖ్య నాయకులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురుగుల్లాంటి వైసీపీ నాయకు లు కృష్ణాజిల్లాలోనే ఉన్నారని, వారికి గుణ పాఠం చెప్పే విధంగా నాయకులు కార్య కర్తలు సన్నద్ధం కావాలన్నారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడు తూ, వైసీపీ పార్టీ నాయకులు చరిత్ర హీనులని, వారికి బొమ్ములూరులో ఏమార్గం లేకే ఎన్టీఆర్ విగ్రహం దిమ్మకు వైసీపీ రం గులు వేశారన్నారు. సిగ్గు ఉన్నవాళ్లు ఎవరు ఇలా చేయరన్నారు. ఎన్టీఆరే వైసీపీ పెట్టాడ ని ఆ నాయకులు చెప్పిన ఆశ్చర్య పోనక్కర లేదని చలోక్తి విసిరారు. ఏలూరు పార్లమెం ట్ నియోజకవర్గం ఇన్చార్జి గన్ని వీరాంజనే యులు మాట్లాడుతూ, కృష్ణాజిల్లా వైసీపీలో మూర్ఖులు ఉన్నారన్నారు. కొడాలి నాని, వల్లభ నేని వంశీమోహన్, జోగి రమేష్ ఆ కోవలోకే వస్తారని విమర్శిఽంచారు. నందమూరి కుటుం బాన్ని, టీడీపీని అవమానించిన వీరందరికీ బుద్ధి చెప్పాలన్నారు. టీడీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, రాష్ట్ర నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, గుండప నేని ఉమావర ప్రసాద్, వేములపల్లి శ్రీనివాస రావు, చెన్నుబోయిన శివయ్య, వడ్డిల్లీ లక్ష్మీ, వేగిరెడ్డి పాపారావు, చిరుమామిళ్ల సూర్యం, అట్లూరి శ్రీనివాసరావు, తుమ్మల జగన్, గార్లపాటి రాజేశ్వరరావు, కాకుల శ్రీనివాస రావు, మాదల శ్రీనివాసరావు, కాకుమాను గోపి పాల్గొన్నారు.