బస్సు చార్జీల పెంపుపై సీపీఐ రాస్తారోకో
ABN , First Publish Date - 2022-07-02T06:18:35+05:30 IST
ఆర్టీసీ బస్సుల చార్జీల పెంపునకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో గంపలగూడెం గాంధీ సెంటర్లో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
గంపలగూడెం, జూలై 1: ఆర్టీసీ బస్సుల చార్జీల పెంపునకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో గంపలగూడెం గాంధీ సెంటర్లో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ నాయకుడు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ బస్సు చార్జీలు పెంచి రెండు మా సాలు కూడా కాలేదని మరళా సెస్ పేరుతో చార్జీలు పెంచడం అన్యాయ మన్నారు. ఇప్పటికే ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారన్నారు. బస్సుచార్జీల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు. గౌర్రాజు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.