టీడీపీ విజయానికి పని చేయండి
ABN , First Publish Date - 2022-11-04T00:58:09+05:30 IST
వైసీపీ ప్రభుత్వ అసమర్థ, అవినీతి పాలనను ఎండగట్టి టీడీపీ పునర్వై భవానికి కృషిచేయాలని పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సూచించారని ఆ పార్టీ యువనేత వడ్డే సాయి శోభన్ తెలిపారు.
ఉయ్యూరు, నవంబరు 3: వైసీపీ ప్రభుత్వ అసమర్థ, అవినీతి పాలనను ఎండగట్టి టీడీపీ పునర్వై భవానికి కృషిచేయాలని పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సూచించారని ఆ పార్టీ యువనేత వడ్డే సాయి శోభన్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో లోకేశ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. యువత రాజకీయాల్లోకి రావాలని, జిల్లాలో చంద్రబాబు రోడ్డుషో విజయ వంతం అయ్యేలా పనిచేయాలని సూచించా రన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని లోకేశ్కు చెప్పానని తెలిపారు.