సంపద తయారీ కేంద్రాలను అభివృద్ధి చేయాలి
ABN , First Publish Date - 2022-01-23T05:59:52+05:30 IST
ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించటానికి ప్రాముఖ్యత నిస్తుందని జడ్పీసీఈవో సూర్యప్రకాశరావు అన్నారు.
జడ్పీసీఈవో సూర్యప్రకాశరావు
గుడివాడ రూరల్, జనవరి 22 : ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించటానికి ప్రాముఖ్యత నిస్తుందని జడ్పీసీఈవో సూర్యప్రకాశరావు అన్నారు. చౌటపల్లి గ్రామసచివాలయం వద్ద చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు ఒకరోజు శిక్షణా తరగతులకు శనివారం సీఈవో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపద తయారీ కేంద్రాలు ప్రతీ గ్రామపంచాయతీలో అభివృద్ధి చేయాలన్నారు. పంచాయతీలకు ఆదాయంతోపాటు ప్రకృతి సిద్ధంగా లభించే వనరులను కాపాడినట్లవుతుందని తెలిపారు. ప్రతీ కార్యదర్శి బాధ్యతాయుతంగా సంపద తయారీ కేంద్రాలు పెంచటానికి చూడాలన్నారు. డీపీవో జ్యోతి మాట్లాడుతూ గ్రామాలు పన్నుల వసూళ్లతోపాటు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి సిబ్బంది కృషి చేయాలన్నారు. డీఎల్పీవో నాగిరెడ్డి, ఎంపీడీవో ఎ.వెంకటరమణ, ఎంపీపీ గద్దె పుష్పరాణి పాల్గొన్నారు.