విజయవాడ: పీఎస్‌లో ఎంపీ అనుచరులు హల్ చల్.. విచారణకు ఆదేశించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-02-16T16:47:38+05:30 IST

కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు హల్ చల్ చేశారు.

విజయవాడ: పీఎస్‌లో ఎంపీ అనుచరులు హల్ చల్.. విచారణకు ఆదేశించిన పోలీసులు

విజయవాడ: నగరంలో అర్ధరాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు హల్ చల్ చేశారు. బస్టాండ్ ఎదురుగా గంగోత్రి హోటల్‌ వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను కృష్ణలంక ఎస్ఐ ఆపారు. తాము ఎంపీ నందిగామ సురేష్ అనుచరులమంటూ వీరంగం వేశారు. పోలీసులను దుర్భాషలాడారు. దీంతో వారిని పీఎస్‌కు తరలించారు.


విషయం తెలుసుకున్న ఎంపీ నందిగామ సురేష్ తన అనుచరులతో అర్ధరాత్రి స్టేషన్‌కు వచ్చారు. ఎంపీ రావడంతో అనుచరులు ఇంకా రెచ్చిపోయారు. పోలీసులతో బాహాబాహికి దిగారు. ఈ తతంగాన్ని  కానిస్టేబుల్ శ్రీనివాస్ వీడియో తీస్తుండగా అతనిని కొట్టి ఫోన్ లాక్కున్నారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నందిగాం సురేష్ అనుచరులను వారించకుండా పోలీసులను హెచ్చరిస్తూ తనవారిని విడిపించుకుని వెళ్లిపోయారు. బైక్ రాష్  డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన వ్యక్తి ఎంపీకి సమీప బంధువని తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ముగ్గురిపై కేసు పెట్టారు. ఈ వ్యహరంపై విచారణకు ఆదేశించారు. ఆత్మగౌరవం అంశంగా తీసుకున్న పోలీసులు.. న్యాయ సలహా తీసుకుని మరింత ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.

Updated Date - 2022-02-16T16:47:38+05:30 IST