వలంటీర్లకు నియామక పత్రాలు అందజేత
ABN , First Publish Date - 2022-01-19T06:48:25+05:30 IST
వలంటీర్లకు నియామక పత్రాలు అందజేత
ఉంగుటూరు, జనవరి 18 : ప్రభుత్వసంక్షేమ పథకాలు ప్రజల ఇంటిముంగిటకు చేరుస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని నూతనంగా ఎంపికైన వలంటీర్లకు ఎంపీడీవో కె.జ్యోతి సూచించారు. మండలంలోని మానికొండ, ఆత్కూరు, తరిగొప్పల గ్రామాల్లో ఖాళీగావున్న ఐదు వలంటీర్ల పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం స్ధానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆమె నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి వలంటీరుకి కేటాయించిన కుటుంబాల సమస్త సమాచారం అందుబాటులో వుండాలని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడంలో నిస్వార్ధంగా, పారదర్శకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. సూపరింటెండెంట్ కె.రమణబాబు, తరిగొప్పల, మానికొండ పంచాయతీ కార్యదర్శులు టి.శివప్రసాద్. జి.రత్నకిషోర్, జూనియర్ అసిస్టెంట్ ఎం.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.