నేడు ఈఎన్టీ వైద్యశిబిరం
ABN , First Publish Date - 2022-09-11T06:11:31+05:30 IST
నేడు ఈఎన్టీ వైద్యశిబిరం
పటమట, సెప్టెంబరు 10: గురునానక్ కాలనీలో గురుద్వారా వారి సౌజన్యంతో గురు ద్వారా గుడి వద్ద ఉచిత ఈఎన్టీ వైద్య శిబిరాన్ని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని శ్రీగురుసింగ్ సభా కమిటీ ఒక కమిటీ ప్రకటనలో తెలిపింది. అనువజ్ఞులైన వైద్యబృందం చెవి, ముక్కు, గొంతు, మెడ సంబంధిత సమస్యలకు వైద్య పరీక్షలు చేస్తుందన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.