వైసీపీతో రాష్ట్రం సర్వనాశనం
ABN , First Publish Date - 2022-05-25T06:03:01+05:30 IST
రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
బాదుడే - బాదుడులో మాజీ మంత్రి దేవినేని ఉమా
జి.కొండూరు, మే 24: రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాయనపాడులో, జి.కొండూరు మండలం చిన్ననందిగామ గ్రామంలో మంగళవారం బాదుడే - బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పన్నులతో ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచారన్నారు. ఒక్కచాన్స్ ఇచ్చినందుకు అనుభవిస్తున్నామని ప్రజలంతా ఆవేదన చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో ధనేకుల సాంబశివరావు (బుల్లిబాబు), ఉయ్యూరు వెంకట నరసింహారావు, సర్పంచ్ ధనేకుల శ్రీకాంత్, లంక లితీష్, పజ్జూరు రవికుమార్, లంక రామకృష్ణ, కోయ పాపారావు, విసం ప్రభాకర్, రాయనపాడులో శీలంనేని సాంబశివరావు, వడ్లమూడి చలపతిరావు, రంగినేని నరేంద్ర, కాటంనేని శివ ప్రసాద్, షేక్ కరిముల్లా, పోలసాని సుబ్బారావు, గంధం సుబ్బారావు, శీలంనేని తిరుమలరావు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో..
24.వ వార్డు, ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న భీమరాజుగుట్ట ఏరియాల్లో టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, సీనియర్ నేత జంపాల సీతారామయ్య పాల్గొని వైసీపీ మూడేళ్ల పాలనలో నెలకొన్న దుర్భర పరిస్థితులను వివరించే కరపత్రాలను పంచారు. కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కేతనకొండ, మూలపాడు గ్రామాల్లో కరపత్రాల పంపిణీతోపాటు ఇంటింటికీ కొవ్వొత్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొమ్మూరు గోపాలరావు, కాకి నాగరాజు, పత్రి లేపాక్షి రావు, గరికపాటి శివ, పులి వెంకటేశ్వర్లు, రాఘవులు, గరికపాటి శ్రీనివాసరావు, గొరిజాల సాంబశివరావు, జొన్నలగడ్డ సురేంద్ర, ఏసుబాబు పాల్గొన్నారు.