త్వరితగతిన అర్జీల పరిష్కారానికి చర్యలు

ABN , First Publish Date - 2022-07-05T06:08:20+05:30 IST

స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని నగర్ద కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అన్నారు.

త్వరితగతిన అర్జీల పరిష్కారానికి చర్యలు

త్వరితగతిన అర్జీల పరిష్కారానికి చర్యలు

నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ 

చిట్టినగర్‌, జూలై 4 : స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని నగర్ద కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో స్పందన నిర్వహించారు. నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీలుగా కమిషనర్‌కు అందజేశారు. మొత్తం 9 అర్జీలు వచ్చాయి. అదనపు కమిషనర్‌ జనరల్‌ ఎం.శ్యామల, అదనపు కమిషనర్‌ ప్రాజెక్ట్‌ కె.వి. సత్యవతి, జాయింట్‌ డైరెక్టర్‌ (అమృత్‌) డా. కె.బి.ఎన్‌.ఎస్‌ లతా, చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.ప్రభాకరరావు, చీఫ్‌ మెడికల్‌ ఆఽపీసర్‌ ఇన్‌చార్జి బాబు శ్రీనివాసన్‌, సిటీ ప్లానర్‌ జి.వి.జిఎస్‌.వి.ప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు. 

టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలి: కార్పొరేటర్‌ సత్యబాబు 

టిడ్కో ఇళ్లకోసం పేదల నుంచి డబ్బులు కట్టించుకొని నాలుగేళ్లు గడుస్తున్న ఇంతవరకు  ఒక్కరికి ఇళ్లు ఇవ్వలేదని, వెంటనే లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలని సీపీఎం ఫ్లోర్‌లీడర్‌, కార్పొరేటర్‌ బోయి సత్యబాబు డిమాండ్‌ చేశారు. ఇళ్లు ఇవ్వకుండానే బ్యాంక్‌లలో లోన్‌లకు డబ్బులు కట్టాలని వస్తున్న నోటీసులకు నగరపాలక సంస్థ, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలని, బ్యాంక్‌ నోటీసులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ లబ్ధిదారుల తరపున సోమవారం స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2022-07-05T06:08:20+05:30 IST