రోడ్డు ప్రమాదంలో తరకటూరు రైతు దుర్మరణం
ABN , First Publish Date - 2022-11-21T01:16:34+05:30 IST
గూడూరు మండలం తరకటూరు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం చెందాడు.
మచిలీపట్నం టౌన్, నవంబరు 20 : గూడూరు మండలం తరకటూరు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం చెందాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న కాట్రగడ్డ భాస్కరరావు (55)ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ పరార య్యాడు. స్థానికులు కారును వెంబడించి పట్టుకున్నారు. మృతి చెందిన కాట్రగడ్డ భాస్కరరావు తరకటూరుకు చెందిన రైతుగా గుర్తించారు. గూ డూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.