చప్టాను పునర్నిర్మించండి
ABN , First Publish Date - 2022-11-30T00:28:15+05:30 IST
దుందిరాలపాడు - జింకలపాలెం రహదారిలో దెబ్బతిన్న చప్టాను పునర్ నిర్మించాలని దుందిరాలపాదడు శివారు మల్లెంపాడు బీసీ కాలనీవాసులు ఎమ్మెల్యే కె.రక్షణనిధికి దృష్టికి తెచ్చారు.
గంపలగూడెం, నవంబరు 29: దుందిరాలపాడు - జింకలపాలెం రహదారిలో దెబ్బతిన్న చప్టాను పునర్ నిర్మించాలని దుందిరాలపాదడు శివారు మల్లెంపాడు బీసీ కాలనీవాసులు ఎమ్మెల్యే కె.రక్షణనిధికి దృష్టికి తెచ్చారు. దుందిరాలపాడులో రెండో రోజు మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. మల్లెంపాడు గ్రామ ప్రజలు శ్మశానవాటికకు వెళ్లే రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో లోపాలు వల్ల మిట్టగూడెంలో విద్యుత్ లో ఓల్టేజీ వస్తుందని దీని వల్ల ప్రజలు విద్యుత్ సమస్యను ఎదుర్కొంటునందున నూతన టాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని వైసీపీ నాయకుడు కాపా సత్యనారాయణ ఎమ్మెల్యేకు వివరించారు. ఎంపీపీ గోగులమూడి శ్రీలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు కోట శ్యామ్యూల్, సర్పంచ్ బంకా బాబురావు, ఎంపీటీసీ సభ్యురాలు తాళ్లూరి వెంకట్రావమ్మ, పీఏసీఎస్ అధ్యక్షుడు ఊటుకూరు రాంబాబు, మార్తి కృష్ణయ్య, ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి, ఎస్సై వి.సతీష్ పాల్గొన్నారు.