నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా

ABN , First Publish Date - 2022-12-07T00:36:33+05:30 IST

పటమట సర్కిల్‌-3 కార్యాలయంలో మంగళవారం మొబైల్‌ కోర్టు నిర్వహించి శానిటేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి రూ.12వేల 450లను అపరాధ రుసుంగా కార్పొరేషన్‌ కోర్టు న్యాయమూర్తి యు. రామ్మోహన్‌ విధించారు.

నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా

నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా

పటమట, డిసెంబరు 6 : పటమట సర్కిల్‌-3 కార్యాలయంలో మంగళవారం మొబైల్‌ కోర్టు నిర్వహించి శానిటేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి రూ.12వేల 450లను అపరాధ రుసుంగా కార్పొరేషన్‌ కోర్టు న్యాయమూర్తి యు. రామ్మోహన్‌ విధించారు. కక్షిదారులతో న్యాయమూర్తి మాట్లాడుతూ మరోసారి ఈ విధంగా వ్యవహరించినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం న్యాయమూర్తి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

జోనల్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఏ.రవిచంద్‌, హెల్త్‌ ఆఫీసర్లు డాక్టర్‌ శ్రీదేవి, ఇక్బాల్‌ హుస్సేన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:36:36+05:30 IST