నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా
ABN , First Publish Date - 2022-12-07T00:36:33+05:30 IST
పటమట సర్కిల్-3 కార్యాలయంలో మంగళవారం మొబైల్ కోర్టు నిర్వహించి శానిటేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి రూ.12వేల 450లను అపరాధ రుసుంగా కార్పొరేషన్ కోర్టు న్యాయమూర్తి యు. రామ్మోహన్ విధించారు.
నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా
పటమట, డిసెంబరు 6 : పటమట సర్కిల్-3 కార్యాలయంలో మంగళవారం మొబైల్ కోర్టు నిర్వహించి శానిటేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి రూ.12వేల 450లను అపరాధ రుసుంగా కార్పొరేషన్ కోర్టు న్యాయమూర్తి యు. రామ్మోహన్ విధించారు. కక్షిదారులతో న్యాయమూర్తి మాట్లాడుతూ మరోసారి ఈ విధంగా వ్యవహరించినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం న్యాయమూర్తి కౌన్సెలింగ్ నిర్వహించారు.
జోనల్ కమిషనర్ డాక్టర్ ఏ.రవిచంద్, హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ శ్రీదేవి, ఇక్బాల్ హుస్సేన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు.