న్యూఢిల్లీ పరేడ్కు బూరగగూడెం విద్యార్థిని
ABN , First Publish Date - 2022-01-26T05:44:27+05:30 IST
న్యూఢిల్లీ పరేడ్కు బూరగగూడెం విద్యార్థిని
రెడ్డిగూడెం, జనవరి 25: రిపబ్లిక్ డే సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించే పరేడ్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్సీసీ క్యాడెట్గా పాల్గొనేందుకు బూరుగగూడెం గ్రామానికి చెందిన ఏరువ సౌమ్య ఎంపికయ్యారు. సౌమ్య కాకినాడ కౌట్ కళాశాలలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.