AP News: వికటించిన నాటు వైద్యం... ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-12-10T08:40:31+05:30 IST

జిల్లాలోని ఓబులదేవరచెరువు మండలంలో నాటు వైద్యం వికటించి ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది.

AP News: వికటించిన నాటు వైద్యం... ఇద్దరు మృతి

శ్రీ సత్యసాయి: జిల్లాలోని ఓబులదేవరచెరువు మండలంలో నాటు వైద్యం వికటించి ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఓబుల దేవర చెరువు మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారు... నాటు వైద్యుడితో మోకాళ్ళ నొప్పులకు వైద్యం తీసుకుంటుంటారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఆమడగూరు మండలం పూలకుంట్లపల్లిలో నాటు వైద్యుడి వద్ద బాధితులు మోకాళ్ళ నొప్పులకు ఇంజక్షన్ వేయించుకున్నారు. అయితే వైద్యం వికటించడంతో వారంతా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఓ.డి చెరువు మండలం తాటి మేకల పల్లికి చెందిన పప్పూరమ్మ, బసప్ప గారిపల్లికి చెందిన రామప్ప మృతి చెందగా... మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Updated Date - 2022-12-10T08:40:32+05:30 IST