సీఎం జగన్ను కలిసిన ఎంపీ బాలశౌరి
ABN , First Publish Date - 2022-11-25T02:15:11+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బందరుపోర్టు నిర్మాణం నిమిత్తం కేంద్రప్రభుత్వ సంస్థ పవర్ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.3,941కోట్లను మంజూరు చేయించడంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకున్న నేపధ్యంలో సీఎంను కలసినట్టు ఎంపీ తెలిపారు. డిసెంబరులో పోర్టు పనులు ప్రారంభించనున్న నేపధ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.న్నారు.