బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్.వి.రామారావు : మండలి
ABN , First Publish Date - 2022-06-29T06:52:11+05:30 IST
చిత్రకారుడిగా, కవిగా, రచయితగా, విభిన్న రంగాల్లో గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి పద్మశ్రీ ఎస్.వి.రామారావు అని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
అవనిగడ్డ టౌన్ : చిత్రకారుడిగా, కవిగా, రచయితగా, విభిన్న రంగాల్లో గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి పద్మశ్రీ ఎస్.వి.రామారావు అని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చికాగో నగరంలో తెలుగుసాహితీ మిత్రు లు, చికాగో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఎస్.వి.రామారావు రచించిన ’’అలోలాంతరాల్లో’’ కవితా సంపుటిని మండలి బుద్ధఫ్రసాద్ ఆవిష్కరించారు. చికాగో సాహితీ మిత్రుల సంస్థ అధ్యక్షుడు మెట్టుపల్లి జయదేవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దామరాజు లక్ష్మి, చిమ్మటా కమల, మాదిరెడ్డి పద్మ, జంపాల చౌదరి, శొంఠి శ్రీరామ్, రవీంద్రరెడ్డి, తిమ్మాపురం ప్రకాష్, దాసరి అమరేంద్ర, కార్టూనిస్ట్ శ్రీధర్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్.వి.రామారావు రచించిన సాహితీ సంపుటిని తెలుగుభాషా అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన మండలి వెంకటేశ్వరరావుకు అంకితమిచ్చారు.