కృష్ణా జిల్లా: దళిత సంఘాలపై కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-01-21T17:33:28+05:30 IST

కృష్ణా జిల్లా: జి. కొండూరులో దళిత సంఘాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కృష్ణా జిల్లా: దళిత సంఘాలపై కేసులు నమోదు

కృష్ణా జిల్లా: జి. కొండూరులో దళిత సంఘాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గంగినేని దళిత యువకులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని గురువారం జి. కొండూరు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన దళిత సంఘాలు, రిటైర్డ్ జడ్జి జడ శ్రవణ్ కుమార్‌తో సహా 16 మందిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలింగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్నాలో పాల్గొన్న వారి పేర్లు తెలుసుకుంటున్నారు. ధర్నాలో ఎంతమంది పాల్గొన్నారో అంతమందిపై కేసులు పెడతామని జి.కొండూరు ఎస్‌ఐ ధర్మరాజు తెలిపారు.

Updated Date - 2022-01-21T17:33:28+05:30 IST