కోళ్ల ఫారంలో రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2022-12-07T00:56:26+05:30 IST
అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసిన పాతపాడులోని ఓ కోళ్ల ఫారంపై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడి చేశారు. కోళ్ల ఫారం షెడ్లో ఉన్న 16 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ రూరల్, డిసెంబరు 6 : అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసిన పాతపాడులోని ఓ కోళ్ల ఫారంపై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడి చేశారు. కోళ్ల ఫారం షెడ్లో ఉన్న 16 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. పాతపాడులో సీహెచ్. నరేంద్ర అనే వ్యక్తి కోళ్ల ఫారం నిర్వహి స్తున్నాడు. కోళ్ల మేత కోసం ఫారంలో భారీగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు సమా చారం అందుకున్న విజిలెన్స్ సీఐ వసంత్ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడుల్లో రేషన్ బియ్యం ఉండటాన్ని గుర్తించి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చారు.