ఇల ఇంద్రలోకం
ABN , First Publish Date - 2022-11-08T00:48:02+05:30 IST
కోటి వెలుగులు ఒకేసారి విరబూసినట్టు దుర్గమ్మ కొండ కాంతులమయమైంది.
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కోటి వెలుగులు ఒకేసారి విరబూసినట్టు దుర్గమ్మ కొండ కాంతులమయమైంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఈవో భ్రమరాంబ పాల్గొని దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు. కాగా, జిల్లాలోని శైవక్షేత్రాల్లో సోమవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివయ్యను దర్శించి అభిషేకాలు నిర్వహించారు. పున్నమి సాయంత్రం జ్వాలాతోరణం ఘనంగా జరిపారు.