వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
ABN , First Publish Date - 2022-11-17T01:45:28+05:30 IST
తాడిగడప మునిసిపాలిటీ యనమలకుదురుకు చెందిన వైసీపీ కార్యకర్తలు పలువురు బుధవారం టీడీపీలో చేరారు.
పెనమలూరు, నవంబరు 16: తాడిగడప మునిసిపాలిటీ యనమలకుదురుకు చెందిన వైసీపీ కార్యకర్తలు పలువురు బుధవారం టీడీపీలో చేరారు. కుటుంబాలతో సహా రాయల రాందాసు, ఉర్రే రాజేష్, బుంగ బాలాస్వామి తదితరులు టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.