జంక్షన్ నుంచి మహానాడుకు..
ABN , First Publish Date - 2022-05-28T06:37:37+05:30 IST
జంక్షన్ నుంచి మహానాడుకు..
హనుమాన్జంక్షన్ / రూరల్, మే 27 : ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడు ప్రారంభ సభకు బాపులపాడు మండలం నుంచి పది మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ నాయకులు దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేశ్, ఆళ్ల గోపాలకృష్ణ, గుండపనేని ఉమా వరప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు, మూల్పూరి సాయికల్యాణి, కలపాల సూర్యనారాయణ, వేగిరెడ్డి పాపారావు, చెన్నుబో యిన శివయ్య, పొట్లూరి గోపి తరలివెళ్లారు.
పోరంకి నుంచి ..
పెనమలూరు : ఒంగోలులో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి పెనమలూరు మండలం నుంచి టీడీపీ నాయకులు తరలివెళ్లారు. శుక్రవారం పోరంకిలోని టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలగపూడి శంకరబాబు, అనుమోలు ప్రభాకరరావు, బొర్రా కృష్ణ, షేక్ బుజ్జి, ద్రోణవల్లి సుబ్బారావు, అంగిరేకుల మురళి తదితరులు పాల్గొన్నారు.