రైతులకు 15 రోజుల్లో నష్టపరిహారం చెల్లించకుంటే ఆమరణ దీక్ష : జనసేన

ABN , First Publish Date - 2022-11-27T01:37:01+05:30 IST

స్వచ్ఛందంగా క్రాప్‌ హాలీడే ప్రకటించిన 17వ నెంబర్‌ కాలువ కింద రైతులకు 15 రోజుల్లోగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని జనసేన నేతలు సష్టం చేశారు. ఈస్ట్‌ ఛానల్‌ 15, 16, 17, 18 కాలువల కింద ఉప్పునీటి ముంపునకు గురై బీడు వారిన భూములను బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు.

  రైతులకు 15 రోజుల్లో నష్టపరిహారం చెల్లించకుంటే ఆమరణ  దీక్ష  : జనసేన

కోడూరు : స్వచ్ఛందంగా క్రాప్‌ హాలీడే ప్రకటించిన 17వ నెంబర్‌ కాలువ కింద రైతులకు 15 రోజుల్లోగా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేపడతానని జనసేన నేతలు సష్టం చేశారు. ఈస్ట్‌ ఛానల్‌ 15, 16, 17, 18 కాలువల కింద ఉప్పునీటి ముంపునకు గురై బీడు వారిన భూములను బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు. గతంలో రెండేళ్ల పాటు నాలుగువేల ఎకరాల్లో పంట వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ ఏడాది పంట వేసే పరిస్థితే స్వచ్ఛందంగా క్రాప్‌ హాలీడే ప్రకటించారన్నారు. వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. గుడివాక శేషుబాబు, మర్రె గంగయ్య, కోట సత్యనారాయణ, ఉల్లి శేషగిరి, బడే వెంకటేశ్వరరావు, బండే గోపాలకృష్ణ, జరుగు నారాయణ, బండే ఆంజనేయులు, సంగాబత్తుల నరసయ్య, రైతులు సింహాద్రి వెంకటేశ్వరరావు, కొక్కిలిగడ్డ భిక్షం పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T01:37:03+05:30 IST